న్యూఢిల్లీ: క్రికెటర్ రిషబ్ పంత్ను మెరుగైన చికిత్స కోసం ముంబై తరలించనున్నారు. ఢిల్లీ క్రికెట్ సంఘం డైరెక్టర్ శ్యామ్ శర్మ ఈ విషయాన్ని తెలిపారు. డిసెంబర్ 30వ తేదీన తెల్లవారుజామున రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అయితే మరింత మెరుగైన చికిత్స అందించేందుకు వీలుగా అతన్ని ఇవాళ ముంబైకి తరలిస్తున్నట్లు శ్యామ్ శర్మ చెప్పారు. డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్లో రిషబ్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
బీసీసీఐ డాక్టర్లు పంత్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్నారు. అతని మెడికల్ రిపోర్ట్స్ను పరిశీలించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ అవసరం అయితే అతన్ని లండన్కు కూడా తరలించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.