Zimbabwe : కొత్త ఏడాది ఆరంభంలో జింబాబ్వే(Zimbabwe) జట్టు వన్డే, టీ20 సిరీస్కు సిద్ధమవుతోంది. జనవరిలో శ్రీలంక పర్యటన(Srilanka Tour) ఉన్నందున ఆ దేశ క్రికెట్ బోర్డు సోమవారం 15 మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించింది. ఈ సిరీస్ కోసం విధ్వంసక బ్యాటర్ క్రెగ్ ఎర్వినే(Craig Ervine)కు మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించింది. టీ20లకు సికిందర్ రజా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
ఇక 33 ఏండ్ల ఆఫ్ స్పిన్నర్ మఫుద్జ తపివ, పేసర్ ఫరజ్ అక్రమ్ కూడా అనూహ్యంగా స్క్వాడ్లో చోటు దక్కించుకున్నారు. ఐర్లాండ్ సిరీస్లో అదరగొట్టిన కైతనో, తినశే, మిల్టన్, టోనీలు ఊహించినట్టుగానే లంక సిరీస్కు సెలెక్ట్ అయ్యారు.
వన్డే స్క్వాడ్ : క్రెగ్ ఎర్విన్(కెప్టెన్), అక్రమ్ ఫరాజ్, బర్ల్ రియాన్, గుంబీ జాయ్లార్డ్, జాంగ్వే లుకే, కైతనో తకుడ్జువనషే, కమన్హుకమ్వే, మదండె క్లైవ్, మసకజ్ద వెల్లింగ్టన్, మఫుద్జ తపివ, మున్యోంగ టోని, ముజరబని బ్లెస్సింగ్, గరావ రిచర్డ్, సికిందర్ రజా, శుంబా మిల్టన్.
Zimbabwe have announced their ODI and T20I squads for the Sri Lanka tour.https://t.co/j4iuVaaTl2
— ICC (@ICC) January 1, 2024
టీ20 స్క్వాడ్ : సికిందర్ రజా(కెప్టెన్), బ్రియాన్ బెన్నెటె, రియాన్ బర్ల్, క్రెగ్ ఎర్వినే, జాయ్లార్డ్ గుంబీ, ల్యూకే జాంగ్వే, తనిషే, క్లైవ్ మదండే, వెల్లింగటన్ మసకజ్ద, కార్ల్ ముంబా, టోని మున్యోంగ, బ్లెస్సింగ్ ముజరబని, ఐన్స్లే డ్లోవు, రిచర్డ్ గరవ, మిల్టన్ శుంబ.
జింబాబ్వే జట్టు త్వరలోనే శ్రీలంక గడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇరుజట్ల మధ్య మొదటి మ్యాచ్ జనవరి 6న మొదలవ్వనుండగా.. జనవరి 14 నుంచి మూడు మ్యాచ్ల టీ20ల సిరీస్ షురూ కానుంది. వరల్డ్ కప్లో ఘోర వైఫల్యంతో మేల్కొన్న శ్రీలంక బోర్డు స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్(Kushal Mendis)కు వన్డే కెప్టెన్సీ, ఇక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ(Wanindu Hasaranga) టీ20 కెప్టెన్సీ అప్పగించిన విషయం తెలిసిందే.