న్యూఢిల్లీ: వచ్చే నెలలో వెస్టిండీస్తో జరుగనున్న టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఎంపికపై వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ను ఈ టూర్కు ఎంపిక చేయకపోవడంపై జరుగుతున్న చర్చ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
మైదానంలో ప్రదర్శన మాత్రమే కాకుండా అతడి ప్రవర్తన ఆధారంగానే సర్ఫరాజ్ను ఎంపిక చేయలేదని ఓ అధికారి పేర్కొనగా.. రంజీ ట్రోఫీలో ఢిల్లీపై సెంచరీ చేసిన అనంతరం సర్ఫరాజ్ చేసుకున్న సంబరాలను బోర్డు పెద్దలు తప్పుగా అర్థం చేసుకున్నారని అతడి సన్నిహితులు అంటున్నారు. అతడెప్పుడు నిబంధనలను అతిక్రమించలేదని పేర్కొన్నారు.