జైపూర్: టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్ ఇటీవల నియమితులైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో రేపు జరగనున్న తొలి టీ20 కోసం జైపూర్లో సోమవారం రోహిత్ సేన ప్రాక్టీస్ చేసింది. అయితే కోచ్గా ద్రావిడ్ బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ ప్లేయర్ల తనదైన స్టయిల్లో శిక్షణ ఇచ్చాడు. ప్రాక్టీస్ సెషన్లో ప్లేయర్లకు రాహుల్ ద్రావిడ్ కొన్ని సూచనలు చేశాడు. సవాయి మాన్సింగ్ స్టేడియంలో జరిగిన శిక్షణలో ద్రావిడ్ పాల్గొన్నాడు. బ్యాటర్లకు రాహుల్ కొన్ని బాల్స్ త్రో చేశాడు. టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్ రంగంలోకి దిగిన అంశాన్ని బీసీసీఐ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ప్లేయర్లతో ప్రాక్టీస్ చేయిస్తున్న ఓ వీడియోను అప్డేట్ చేసింది. కొత్త పాత్రలు, కొత్త సవాళ్లు, కొత్త ఆరంభాలు.. అంటూ తన ట్వీట్లో పేర్కొన్నది. టీమిండియా ఆఫీసులో ద్రావిడ్ రాకతో కొత్త జోష్ నిండినట్లు బీసీసీఐ తెలిపింది.