చెన్నై: చెపాక్ మైదానంలో కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్ రెండో బంతికే ప్రమాదకర విరాట్ కోహ్లీ(5)ని ఔట్ చేశాడు. త్రిపాఠి అద్భుత క్యాచ్కు విరాట్ వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మరో బ్యాట్స్మన్ రజత్ పటిదార్(1)ను ఆఖరి బంతికి బౌల్డ్ చేసి బెంగళూరును దెబ్బకొట్టాడు. దీంతో బెంగళూరు 9 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
తొలి నాలుగు ఓవర్లను కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పిన్నర్లతో బౌలింగ్ వేయించాడు. షకీబ్ అల్ హసన్ వేసిన 6వ ఓవర్లో మాక్స్వెల్ ఒక సిక్స్, ఫోర్ బాదగా పడిక్కల్ 4 కొట్టడంతో 17 పరుగులు వచ్చాయి. పవర్ప్లే ఆఖరికి ఆర్సీబీ 2 వికెట్లకు 45 పరుగులు చేసింది. ప్రస్తుతం మాక్స్వెల్(24), దేవదత్ పడిక్కల్(13) క్రీజులో ఉన్నారు.