Champions Trophy | ఎట్టకేలకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది పాక్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్న విషయం తెలిసిందే. ట్రోఫీ షెడ్యూల్ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది. ఈ ఐసీసీ ఈవెంట్ ఫిబ్రవరి 19న మొదలవనున్నది. తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్థాన్ కరాచీలో న్యూజిలాండ్తో తలపడనున్నది. పాకిస్థాన్ చివరి లీగ్ మ్యాచ్ ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్తో రావల్పిండిలో ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ మధ్య లీగ్ మ్యాచ్ ఫిబ్రవరి 23 (ఆదివారం) జరుగనున్నది. మెగా టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. ఇందులో గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి.
ఐసీసీ ఈవెంట్లో భారత్లో తొలి మ్యాచ్ని ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనున్నది. ఆ తర్వాత పాక్తో.. మార్చి 2న న్యూజిలాండ్తో ఆడుతుంది. భారత్ మ్యాచులన్నీ దుబాయి వేదికగా జరుగనున్నాయి. భారత్ మ్యాచులు మినహా మిగతా మ్యాచులన్నీ పాక్ వేదికగా జరుగుతున్నాయి. మార్చి 4, మార్చి 5 తేదీల్లో రెండు సెమీఫైనల్స్ జరుగుతున్నాయి. రెండు సెమీ ఫైనల్స్కు రిజర్వ్ డే ఉంటుంది. మార్చి 9న ఫైనల్కు సైతం రిజర్వ్ డే ఉంటుంది. భారత్ సెమీస్కు అర్హత సాధిస్తే.. ఆ మ్యాచులన్నీ దుబాయిలోనే జరుగుతాయి.
టీమిండియా క్వాలిఫై కాకపోతే పాక్లోనే జరుగుతాయి. టీమిండియా ఫైనల్కు చేరుకోకపోతే ఫైనల్ లాహోర్ స్టేడియంలో జరుగుతుంది. భారత్ టైటిల్ రేసులో నిలిస్తే యూఏఈలో జరగనుంది. భారత జట్టును పాక్కు పంపేందుకు కేంద్రం నిరాకరించడంతో బీసీసీఐ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో ఐసీసీ పాక్ను ఒప్పించింది. అయితే, పాక్ సైతం షరతులు విధించింది. 2024-27 వరకు భారత్లో జరిగే ఐసీసీ ఈవెంట్స్ని సైతం హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాల్సిందేనని పట్టుబట్టగా.. అందుకు ఐసీసీ, బీసీసీఐ అంగీకారం తెలిపాయి. దాంతో ఐసీసీ ఈవెంట్లలో ఈ రెండు జట్లు తటస్థ వేదికల్లో తలపడనున్నాయి.
Check out the full fixtures for the ICC Champions Trophy 2025. pic.twitter.com/oecuikydca
— ICC (@ICC) December 24, 2024