IND vs ENG : భారత స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) యార్కర్లతో ఇంగ్లండ్ బ్యాటర్లను వణికిస్తున్నాడు. దాంతో, రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పరాభవం తప్పించుకునేందుకు పోరాడుతోంది. రెండో సెషన్లో 4 వికెట్ల నష్టానికి 154 రన్స్ కొట్టింది. ప్రస్తుతం ఓలీ పోప్(52) , కెప్టెన్ బెన్ స్టోక్స్(3) క్రీజులో ఉన్నారు. ఇంకా ఇంగ్లండ్ 36 పరుగులు వెనకబడి ఉంది.
భారత ఇన్నింగ్స్ ముగిశాక క్రీజులోకి వచ్చిన ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్(47), జాక్ క్రాలే(31) బజ్ బాల్ ఆటతో విరుచుకుపడ్డారు. అయితే.. అశ్విన్ సూపర్ డెలివరీతో క్రాలేను ఔట్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు. తొలి సెషన్లో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసిన స్టోక్స్ సేన.. బుమ్రా దెబ్బకు లంచ్ తర్వాత టపాటపా వికెట్లు కోల్పోయింది.
Never in doubt!@Jaspritbumrah93 gets his man and the off-stump is out of the ground 🔥🔥
Ben Duckett departs for 47.
Follow the match ▶️ https://t.co/HGTxXf8b1E#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/zlPk2nVgdb
— BCCI (@BCCI) January 27, 2024
బజ్ బాల్ ఆటతో రెచ్చిపోతున్న ఓపెనర్ బెన్ డకెట్(47)ను బౌల్డ్ చేసిన బుమ్రా.. ఆ కాసేటికే ఇంగ్లండ్ గోడ జో రూట్(2)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించిన జానీ బెయిర్స్టో(10)ను సూపర్ డెలివరీతో జడేజా బౌల్డ్ చేశాడు. దాంతో, పర్యాటక జట్టు 140 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
Ollie Pope has kept England in the fight as they now look to take the lead and set a target #INDvENG
▶️ https://t.co/WzuwYpQAGX pic.twitter.com/vlmBfnPF6w
— ESPNcricinfo (@ESPNcricinfo) January 27, 2024
తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు(Team India) తొలి ఇన్నింగ్స్లో 436 పరుగులకు ఆలౌటయ్యింది. మూడో రోజు తొలి సెషన్లో పార్ట్టైమ్ స్పిన్నర్ జో రూట్ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో భారత్ణు దెబ్బకొట్టాడు. దాంతో, రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(87: 180 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)ను ఎల్బీగా వెనక్కి పంపిన రూట్.. ఆ తర్వాతి బంతికే కొత్త బ్యాటర్ జస్ప్రీత్ బుమ్రా(0)ను బౌల్డ్ చేశాడు. హ్యాట్రిక్ బంతిని సిరాజ్ అడ్డుకున్నాడు. కానీ, రెహాన్ అహ్మద్ బౌలింగ్లో అక్షర్ పటేల్(44) బౌల్డ్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది.