IND vs ENG 2nd Test రెండో టెస్టులో టీమిండియా(Team India) విజయానికి మరింత చేరువైంది. స్పిన్నర్లు అశ్విన్, కుల్దీప్ విజృంభించడంతో నాలుగో రోజు తొలి సెషన్లోనే ఇంగ్లండ్ సగం వికెట్లు కోల్పోయింది. లంచ్కు ముందు ఓవర్లో డేంజరస్ బెయిర్స్టో(26)ను బుమ్రా ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో, భోజన విరామానికి 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 205 పరుగులు కావాలి. టెయిలెండర్లతో కలిసి కెప్టెన్ బెన్ స్టోక్స్ ఏ మేరకు పోరాడుతాడనేది చూడాలి.
ఓవర్నైట్ స్కోర్తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ధాటిగా ఆడింది. బౌండరీలతో విరుచుకుపడుతున్న నైట్ వాచ్మన్ రెహాన్ అహ్మద్(23)ను ఔట్ చేసి అక్షర్ పటేల్ వికెట్ల వేటను అరంభించగా.. అశ్విన్ రెండు వికెట్లతో ఇంగ్లీష్ జట్టును కోలుకోలేని దెబ్బకొట్టాడు.
That’s Lunch on Day 4 of the Vizag Test!
5⃣ wickets in the First Session for #TeamIndia! 👏 👏
Stay Tuned for Second Session! ⌛️
Scorecard ▶️ https://t.co/X85JZGt0EV#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/UjaUpXdLH9
— BCCI (@BCCI) February 5, 2024
తొలుత ఉప్పల్ టెస్టు హీరో ఓలీ పోప్(36)ను అశ్విన్ ఔట్ చేశాడు. స్లిప్లో రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్తో పోప్ పెవిలియన్కు చేరగా.. ఆ కాసేపటికే రివర్స్ స్వీప్తో రెండు బౌండరీలు బాదిన జో రూట్(16)ను యష్ బోల్తా కొట్టించాడు. దాంతో, స్టోక్స్ సేన 154 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
2⃣ quick wickets right at the stroke of lunch! 👌 👌@imkuldeep18 🤝 @Jaspritbumrah93
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/9u5yotA8nH
— BCCI (@BCCI) February 5, 2024
ఓ వైపు వరుసగా వికెట్లు పడుతుండడంతో ఓపెనర్ జాక్ క్రాలే(73) కూడా డిఫెన్స్ను ఆశ్రయించాడు. అయితే.. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ సూపర్ డెలివరీతో క్రాలే ఎల్బీగా వెనుదిరిగాడు. లంచ్కు ముందు బుమ్రా ఆఖరి బంతికి బెయిర్స్టో(26)ను ఎల్బీగా ఔట్ చేసి ఇంగ్లండ్ను ఓటమి అంచుల్లోకి నెట్టాడు. రెండో సెషన్లో స్టోక్స్, బెన్ ఫోక్స్ను త్వరగా డగౌట్కు పంపితే టీ సమయానికి భారత్ విజయఢంకా మోగించినట్టే.
Is that the lbw review that wins the game for India!? Kuldeep strikes in his first over of the day to dismisses the set Zak Crawley #INDvENG
▶️ https://t.co/ZsyelyZUeZ pic.twitter.com/xyJgSXmGpb
— ESPNcricinfo (@ESPNcricinfo) February 5, 2024
రెండో ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్(104) సెంచరీ బాదడంతో భారత్ భారీ స్కోర్ దిశగా పయనించింది. అయితే.. షోయబ్ బషీర్ సూపర్ బంతితో గిల్ను ఔట్ చేయగా.. ఆ తర్వాత టామ్ హర్ట్లే నాలుగు వికెట్లతో ఇండియాను దెబ్బకొట్టాడు. దాంతో, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో భారత్ను 255 పరుగులకే కట్టడి చేసింది.