Brij Bhushan | మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు (Wrestling Federation of India Chief), బీజేపీ ఎంపీ (Bjp Mp) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) పై ఢిల్లీ పోలీసులు (Delhi Police) ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఆయన వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
బ్రిజ్ భూషణ్ పై ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో సుమారు 108 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఆయన శిక్షార్హుడేనని ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్ (chargesheet)లో తెలిపారు. నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.
ఇదిలా ఉండగా ఢిల్లీ కోర్టు శుక్రవారం బ్రిజ్ భూషణ్ కు సమన్లు జారీ చేసింది. కేసును కొనసాగించేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. జులై 18న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.
కాగా, బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ (WFI) బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించినట్లు పలువురు మహిళా రెజ్లర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద రెండోసారి కొన్ని రోజుల పాటు నిరసనకు కూడా దిగారు.
మరోవైపు రెజ్లర్లు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. బ్రిజ్ భూషణ్పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దిగివచ్చారు. జూన్ 2న పలు సెక్షన్ల కింద బీజేపీ ఎంపీపై కేసులు నమోదు చేశారు. ఛార్జిషీట్ కూడా ఫైల్ చేశారు. లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు వంటి అభియోగాలను అందులో పేర్కొన్నారు. అయితే మహిళా రెజ్లర్లు తనపై చేసిన లైంగిక వేధింపు ఆరోపణలను బ్రిజ్ భూషణ్ పలుమార్లు ఖండించారు.
Also Read..
samosas | వైద్యుడి కొంప ముంచిన సమోసాలు.. ఏకంగా రూ.1.40 లక్షలు స్వాహా చేసిన మోసగాళ్లు
Zomato | జొమాటో నిర్వాకం.. వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ వచ్చింది
MS Dhoni | తనను సీఎస్కే జట్టులోకి తీసుకోండి అని కోరిన నటుడు.. ధోనీ రియాక్షన్ ఏంటంటే..?