ముంబై: ముంబై ఇండియన్స్తో తొమ్మిదేండ్ల అనుబంధానికి బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ముగింపు పలికాడు. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. 2015లో ముంబైతో కలిసిన ఈ న్యూజిలాండ్ పేసర్..సుదీర్ఘ కాలం తన సేవలందించాడు. బౌలింగ్ కోచ్గా ముంబై నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలువడంలో బాండ్ కీలకంగా వ్యవహరించాడు.
ముంబైతో పాటు ఎమ్ఐ ఎమిరేట్స్ చీఫ్ కోచ్ పదవి నుంచి బాండ్ తప్పుకున్నాడు. ‘ముంబై ఇండియన్స్తో కలిసి పనిచేసే అవకాశం దక్కినందుకు అంబానీ కుటుంబానికి కృతజ్ఞతలు. గత తొమ్మిది సీజన్ల నుంచి మంబై జట్టుతో కలిసి పనిచేశాను. ఇన్ని రోజుల వ్యవధిలో ఎన్నో మరుపురాని అనుభవాలు పొందాను’ అని పేర్కొన్నాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగను బౌలింగ్ కోచ్గా ఎంపిక చేసిన నేపథ్యంలో షేన్ బాండ్ తప్పుకున్నట్లు తెలిసింది.