Ravindra Jadeja : ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భారత జట్టు(Team Inida)కు బౌలింగ్ కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే స్టార్ పేసర్ షమీ(Mohammad Shami) దూరం కాగా.. తొలి టెస్టులో గాయపడిన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) పూర్తిగా కోలుకోలేదు. కనీసం మూడో మ్యాచ్కు అయినా అతడు జట్టులోకి వస్తాడని ఆశించిన భారత అభిమానులకు పెద్ద షాక్. జడేజా మూడో టెస్టులో కూడా ఆడకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే.. తొడ కండరాల గాయం(Harmstring Injury)తో బాధపడుతున్న అతడు కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. దాంతో, అతడు రాజ్కోట్లో జరిగే మ్యాచ్లో ఆడకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం జడేజా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో ఉన్నాడు. అక్కడి వైద్య బృందం అతడి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. రెండు టెస్టు ముగిసేలోపు జడ్డూ ఫిట్నెస్పై బీసీసీఐ ప్రకటన వెల్లడించనుంది.
మామూలుగా తొడ కండరాల నొప్పి పూర్తిగా తగ్గేందుకు నాలుగు నుంచి 8 వారాలు పడుతుంది. అందుకని ఫిబ్రవరి 15న రాజ్కోట్లో మొదలయ్యే మూడో టెస్టుకు జడేజా అందుబాటులో ఉండకపోవచ్చు. దాంతో, అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)నే కొనసాగించడం ఖాయం. రాంచీలో ఫిబ్రవరి 23న జరిగే నాలుగో టెస్టు వరకు జడ్డూ ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది.
ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో రనౌట్గా వెనుదిరిగిన జడేజా ఇబ్బందిగా నడుస్తూనే డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాడు. తొలి ఇన్నింగ్స్లో 86 పరుగులతో జట్టుకు భారీ స్కోర్ అందించిన అతడు ఆ తర్వాత బంతితోనూ చెలరేగి మూడు కీలక వికెట్లు తీశాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్లో కష్టాల్లో పడిన జట్టును ఆదుకుంటాడనుకున్న జడ్డూ 2 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఆ కొద్ది సేపటికే భారత్ 28 పరుగుల తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది.