IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు హిట్టర్ డేవిడ్ మిల్లర్(David Miller) మరికొన్ని మ్యాచ్లకు దూరం కానున్నాడు. విధ్వసంక ఇన్నింగ్స్లకు కేరాఫ్ అయిన మిల్లర్ గాయపడ్డాడు. అతడు కోలుకునేందుకు వారం నుంచి రెండు వారాలు పట్టనుందని సమాచారం. దాంతో, ఈ విధ్వసంక ఆటగాడు గుజరాత్ జట్టు ఆడే పలు మ్యాచ్లకు అందుబాటులో ఉండడు.
పవర్ హిట్టింగ్తో ప్రత్యర్థులన వణికించే మిల్లర్ గాయపడడం, టోర్నీకి దూరమవ్వడం గురించి శుక్రవారం కేన్ విలియమ్సన్(Kane Williamson) వెల్లడించాడు. ‘జట్టు సభ్యులతో మైదానంలోకి దిగడం సంతోషంగా ఉంది. వారానికి పైగా మిల్లర్ సేవల్ని కోల్పోవడం బాధాకరం’ అని కేన్ మామ తెలిపాడు.
విలియమ్సన్, మిల్లర్
మిల్లర్ వచ్చేంత వరకూ విలియమ్సన్ ఆడుతాడని గుజరాత్ యాజమాన్యం తెలిపింది. మిడిలార్డర్లో సిక్సర్లతో విరుచుకుపడే కిల్లర్ మిల్లర్ లేకపోవడం గుజరాత్కు పెద్ద లోటే. ఈ చిచ్చరపిడుగు జట్టులో లేకపోవడంతో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 20-30 పరుగులు తక్కువ చేసింది.
The Punch.ev Electric Striker of the Match between @gujarat_titans & @PunjabKingsIPL goes to Shashank Singh#TATAIPL | @Tataev | #PunchevElectricStriker | #BeyondEveryday | #GTvPBKS pic.twitter.com/v0kAXwcjic
— IndianPremierLeague (@IPL) April 4, 2024
పదిహేడో సీజన్లో సొంత గడ్డపై రెండు మ్యాచుల్లో గెలిచిన గుజరాత్ మూడో మ్యాచ్లో ఓడింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(89 నాటౌట్), సాయి సుదర్శన్(35), విలియమ్సన్(26) ధనాధన్ ఆడడంతో పంజాబ్ కింగ్స్కు 200 లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ ఛేదనలో పంజాబ్ టాపార్డర్ విఫలమైనా కుర్రాళ్లు పట్టు విడువలేదు. శశాంక్ సింగ్(61 నాటౌట్), ఇంప్యాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ(31)లు చివరిదాకా పోరాడి ధావన్ సేన చిరస్మరణీయ విజయంలో భాగమయ్యారు.