తిరుమల : వడ్డికాసులవాడు తిరుమల (TIrumala) వేంకటేశ్వరస్వామికి భక్తులు భారీగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. గత మార్చి నెలలో భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా హుండీ (Hundi Income) కి రూ.118.49 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సుమారు 21.10 లక్షల మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. కోటీ లడ్డూ విక్రయాలు జరిగాయని. 42.85 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం(Annaprasadam) స్వీ్కరించారని వివరించారు. 7.86 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని ఆయన అన్నారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుతలు 18 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం( Sarvadarsan) కలుగుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 62,549 మంది భక్తులు దర్శించుకోగా 26,816 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.33 కోట్లు వచ్చిందన్నారు.