South Africa : సొంతగడ్డపై తొలి టెస్టులో భారీ విజయం సాధించిన దక్షిణాఫ్రికా(South Africa) సిరీస్పై కన్నేసింది. జనవరి 3వ తేదీనకేప్టౌన్లో జరిగే మ్యాచ్కు ముందు సఫారీ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. యువ పేసర్ గెరాల్డ్ కొయెట్జీ(Gerald Coetzee) నిర్ణయాత్మక టెస్టుకు దూరం అయ్యాడు. గాయం కారణంగా అతడు సిరీస్ డిసైడర్లో ఆడడం లేదు. తొలి టెస్టులో ఆడుతుండగా కొయెట్జీ గజ్జల భాగంలో వాపు వచ్చింది. దాంతో, అతడు రెండో ఇన్నింగ్స్లో 5 ఓవర్లు వేశాడంతే.
మ్యాచ్ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించాక 23 ఏండ్ల పేసర్కు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ భావించింది. అయితే.. కొయెట్జీ స్థానంలో సఫారీ సెలెక్టర్లు ఎవరిని తీసుకుంటారు? అనేది తెలియాల్సి ఉంది. లుంగి ఎంగిడి, వియాన్ మడ్లర్ లేదా కేశవ్ మహరాజ్లలో ఒకరిని జట్టులోకి తీసుకునే చాన్స్ ఉంది.
సెంచూరియన్లో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా(South Africa) భారీ విజయం సాధించింది. పేసర్లు రబడ, బర్గర్ చెలరేగడంతో ఇన్నింగ్స్ 32 పరుగులతో టీమిండియా(Team India)పై గెలుపొందింది.163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ సేన 133 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(76) ఒంటరి పోరాటం చేసినా ఇన్నింగ్స్ ఓటమి తప్పించలేకపోయాడు. జాన్సెన్ ఓవర్లో భారీ షాట్ ఆడిన కోహ్లీ.. బౌండరీ వద్ద రబాడ చేతికి చిక్కాడు. దాంతో ప్రొటిస్ జట్టు రెండు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అరంగేట్రంలోనే బర్గర్ 7 వికెట్లతో మెరవగా.. రబడ కూడా ఏడు వికెట్లతో సత్తా చాటాడు.