Guntur Kaaram | సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీలా ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం (Guntur Kaaram). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. తమన్ సంగీతం సమకుర్చాడు. ఈ సాంగ్ చూస్తే.. మహేశ్బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లలో మోత మోగించడం ఖాయమని తెలిసిపోతుంది.
ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తుండగా.. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.