Bhuvneshwar Kumar : భారత సీనియర్ పేసర్ భుశనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar) గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడడం లేదు. దాంతో, అతను ఐర్లాండ్ సిరీస్(Ireland Series) తర్వాత పొట్టి ఫార్మాట్(T20 Farmat)కు వీడ్కోలు పలుకుతాడనే వార్తలు వినిపించాయి. ఆ వార్తలుకు బలం చేకూరుస్తూ ఈ రోజు భువీ ఇన్స్టాగ్రామ్ బయోలో ‘క్రికెటర్’ (Cricketer) అనే పదాన్ని తొలగించాడు. ఇంతకుముందు అతడి బయోలో ‘ఇండియన్ క్రికెటర్'(Indian Cricketer) అని ఉండేది. ఈరోజు క్రికెటర్ పదాన్ని తొలగించడంతో ‘ఇండియన్'(Indian) అని మాత్రమే ఉంది.
దాంతో, ఫ్యాన్స్ అమోమయానికి గురవుతున్నారు. దాంతో, అతను రిటైర్మెంట్ పలుకుతున్నాడా? అని ఆందోళన చెందుతున్నారు. ‘ఇప్పటికే నువ్వే భారత జట్టు గొప్ప బౌలర్’, ‘భువీకి ఘనమైన వీడ్కోలు దక్కకుంటే అది ఎంతో సిగ్గుచేటు’ అంటూ చాలామంది కామెంట్లు పెడతున్నారు.
భువనేశ్వర్ ఇప్పటికే టెస్టులు, వన్డేల్లో ఆడడం లేదు. భారత్ తరఫున టీ20 మ్యాచ్ ఆడి కూడా దాదాపు ఏడాది కావొస్తోంది. భువీ 2022 నవంబర్లో న్యూజిలాండ్తో చివరి మ్యాచ్ ఆడాడు. స్వదేశంలో న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన సిరీస్లోనూ అతడికి చోటు దక్కలేదు. దాంతో, నిరాశకు గురైన భువనేశ్వర్ ఆటకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
భుశనేశ్వర్ కుమార్
పదేళ్ల కెరీర్లో ఈ స్వింగ్ సుల్తాన్ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టీ20ల్లో అత్యధిక (90) వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా నిలిచాడు. ఈ ఫార్మాట్లో రెండు సార్లు ఐదు వికెట్లు తీసిన ఇండియా బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. అంతేకాదు పొట్టి క్రికెట్లో అత్యధిక ఓవర్లు వేసిన భారత బౌలర్ రికార్డు భువీ పేరు మీదే ఉంది. 298 ఓవర్లు వేసిన అతను 23.10 సగటు నమోదు చేశాడు. ఐపీఎల్ పదహారో సీజన్(IPL 2023)లో సన్రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad) తరఫునభువీ 14 వికెట్లతో సత్తా చాటాడు.