బర్మింగ్హాం: కామన్వెల్త్గేమ్స్లో భారత్కు మరో స్వర్ణం లభించింది. పారాలింపిక్ సిల్వర్ మెడల్ విజేత భవీనాబెన్ పటేల్ (Bhavinaben Patel) మరోసారి సత్తా చాటారు. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్ క్లాస్ ఫైనల్లో నైజీరియా ప్లేయర్ ఇఫెచుక్వుడేపై గెలుపుతో బంగారు పతకం సాధించింది. ఇఫెచుక్వుడేను 12-10, 11-2, 11-9 తేడాతో మట్టికరిపించింది. దీంతో కామన్వెల్త్ టీటీలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి ప్లేయర్గా రికార్డుల్లో నిలిచారు. ఇప్పటికే పారా వెయిలిఫ్టింగ్లో సుధీర్ స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.
కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 40 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో 13 స్వర్ణాలు, 11 సిల్వర్, 16 బ్రోన్జ్ మెడల్స్ ఉన్నాయి. 155 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్ (148), కెనడా (84), న్యూజిల్యాండ్ (44) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.