Asian Fencing Championships : ఫెన్సింగ్లో భారత ఆశాకిరణం భవానీ దేవి(C A Bhavani Devi) చరిత్ర సృష్టించింది. ఆసియా ఫెన్సింగ్ చాంపియన్షిప్ సెమీ ఫైనల్లో అడుగపెట్టింది. దాంతో కనీసం కాంస్య పతకం ఖాయం చేసింది. క్వార్టర్ ఫైనల్లో ఆమె వరల్డ్ చాంపియన్ మిసాకి ఎమురా(Misaki Emura)ను ఓడించింది. హోరాహోరీగా జరిగిన పోరులో భవానీ 15-10తో ఎమురాను చిత్తు చేసింది. 2022లో కైరోలో జరిగిన వరల్డ్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో ఎమురా స్వర్ణ పతకం గెలిచింది.
సెమీ ఫైనల్లో ఉజ్బెకిస్థాన్కు చెందిన జయ్నబ్ డయిబెకోవా(Zaynab Dayibekova)తో భవానీ తలపడనుంది. సెమీస్లోనూ గెలిచి బంగారు పతకం దక్కించుకోవాలని భవానీ అనుకుంటోంది. అదే జరిగితే ఈ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఫెన్సర్గా చరిత్ర సృష్టించనుంది.
‘భారత ఫెన్సింగ్ బృందం గర్వించదగ్గ రోజు ఇది. ఇంతకుముందు మరే ఫెన్సర్కు సాధ్యం కానిదాన్ని భవానీ చేసి చూపించింది. ప్రతిష్ఠాత్మకమైన ఆసియా చాంపియన్షిప్లో పతకం తేనున్న తొలి భారత ఫెన్సర్ ఆమెనే. ఈ సందర్భంగా ఆమెకు భారత ఫెన్సింగ్ సమాజం తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. ఫైనల్ చేరి భవానీ బంగారు పతకం సాధించాలని కోరుకుంటున్నా’ అని భారత ఫెన్సింగ్ సమాఖ్య(Fencing Association of India) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా(Rajeev Mehta) తెలిపాడు.