సౌథాంప్టన్: ఇండియన్ క్రికెట్ టీమ్ ఎక్కడ ఆడుతున్నా గ్యాలరీలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది భారత్ ఆర్మీ. ప్రపంచవ్యాప్తంగా టీమిండియాను చీర్ చేయడానికి ఈ భారత్ ఆర్మీ అభిమానులు సిద్ధంగా ఉంటారు. తాజాగా న్యూజిలాండ్తో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఈ భారత్ ఆర్మీ ఇండియన్ టీమ్ను చీర్ చేసింది. ముఖ్యంగా కెప్టెన్ కోహ్లికి ఓ స్పెషల్ సాంగ్ను డెడికేట్ చేసింది. అతడు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ ఆర్మీలోని ఓ వ్యక్తి ఈ పాట పాడాడు. మిగతా వాళ్లంతా బ్యాండ్ వాయిస్తూ.. కోరస్ ఇస్తూ విరాట్ను చీర్ చేశారు. ఈ వీడియోను ఐసీసీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.