WPL | బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో బెంగళూరు బోణీ కొట్టింది. శనివారం హోరాహోరీగా సాగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2 పరుగుల తేడాతో యూపీ వారియర్స్పై విజయం సాధించింది. మొదట బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. సబ్బినేని మేఘన (53; 7 ఫోర్లు, ఒక సిక్సర్), రిచ ఘోష్ (62; 12 ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు.
అనంతరం లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 రన్స్ చేసింది. గ్రేస్ హారీస్ (38), శ్వేత షెరావత్ (31) పోరాడినా ఫలితం లేకపోయింది. బెంగళూరు బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ శోభన ఆశ 5 వికెట్లతో అదరగొట్టింది. లీగ్లో భాగంగా ఆదివారం గుజరాత్తో ముంబై తలపడనుంది.