Impact Player | క్రికెట్లో మజాను పెంచేందుకు అన్ని దేశాల క్రికెట్ బోర్డులు, అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఆటను మరింత రసవత్తరంగా, ఉత్సాహాన్ని పెంచేందుకు కొత్త కొత్త నిబంధనలు ప్రవేశపెడుతుంటాయి. ఈ క్రమంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త నిబంధనను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నది. అదే ఇంపాక్ట్ ప్లేయర్. ప్రస్తుతం ఇలాంటి నిబంధన ఫుట్బాల్, రగ్బీలో కనిపిస్తుంటుంది. ఈ నిబంధనతో ప్రతి మ్యాచ్కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు 11 మంది ఆటగాళ్లకు బదులుగా 15 మందిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఇందులో టీ20 జట్లు ఇక నుంచి నలుగురు అదనపు ఆటగాళ్లను మార్చుకునే అవకాశం వీలుంటుంది. దీంతో మ్యాచ్ జరిగే సమయంలో ఒక ఆటగాడిని ని మార్చుకునే అవకాశం ఉంటుంది. అలా తీసుకున్న ఆ ఆటగాడిని ఇంపాక్ట్ ప్లేయర్గా పిలుస్తారు. అయితే మ్యాచ్లో ఇరు జట్లు ఒక్కసారి మాత్రమే దీన్ని ఉపయోగించుకునే వీలుంటుంది. బీసీసీఐ ఈ నిబంధనలు మొదట దేశవాళీ మ్యాచ్లో ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు సర్క్యులర్ను జారీ చేసింది. ఈ నిబంధన విజయవంతమైతే ఆ తర్వాత ఐపీఎల్కు వర్తింపజేయాలని యోచిస్తున్నది.
వచ్చే అక్టోబర్ 11 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో తొలిసారిగా ఈ నిబంధనను ప్రవేశపెట్టనున్నది. ఆస్ట్రేలియా టీ20 లీగ్ బిగ్బాష్లో ఇప్పటికే ఇలాంటి నిబంధన ఉండగా.. దీన్ని ‘ఎక్స్ ఫ్యాక్టర్’ పేరుతో పిలుస్తున్నారు. టీ20 క్రికెట్కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కొత్తదనాన్ని తీసుకురావడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నది. అయితే ఈ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనపై భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
‘టీ20 క్రికెట్లో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ అవసరం ఏముందో తనకు అర్థం కావడం, ఇప్పటికే టీ20లకు మంచి ఆదరణ ఉందని ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే పేర్కొన్నారు.కొత్త మసాలను జోడిస్తే, కొన్నాళ్లకు మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేందుకు ఇంకేదో చేయాలనే ఆలోచనలోకి పడిపోతామని, ప్రతీ ఏడాది కొత్తగా ఏం చేస్తున్నారనే ఆలోచనే జనాల్లో పెరుగుతుందని, 50 ఓవర్ల క్రికెట్కి ఆదరణ రావడం లేదని టీ20లు తీసుకువచ్చారన్న హర్ష.. ప్రస్తుతం వాటిని బాగానే చూస్తున్నారని, మళ్లీ మార్పులు చేయడం ఎందుకు అంటూ అంటూ ట్వీట్ చేశాడు.