Team India | ఈ నెల 25 నుంచి హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్- భారత్ జట్టు తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనున్నది. ఇంగ్లండ్తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు జట్ల కోసం బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది. రోహిత్ శర్మ సారధిగా, జస్ప్రీత్ బుమ్రా వైస్కెప్టెన్గా, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్ దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్, అవేశ్ ఖాన్లను ఎంపిక చేసింది.
తొలి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్లోని ఉప్పల్ లోని క్రికెట్ స్టేడియం, ఫిబ్రవరి రెండో తేదీ నుంచి ఆరో తేదీ వరకు విశాఖపట్నంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు రాజ్కోట్లో మూడో టెస్ట్ మ్యాచ్, ఫిబ్రవరి 23 నుంచి 27వ తేదీ వరకు రాంచీలో నాలుగో టెస్ట్ మ్యాచ్, ధర్మశాలలో మార్చి ఏడో తేదీ నుంచి 11వ తేదీ వరకు చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా తెలిపారు.