Jay Shah | న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్నకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకోలేకపోయిన స్టేడియంలకు ద్వైపాక్షిక సిరీస్లలో అధిక ప్రాధాన్యమిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. ఈ మేరకు రాష్ర్టాల క్రికెట్ సంఘాలకు లేఖ రాశాడు. ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్లోని 10 వేదికల్లో వన్డే ప్రపంచకప్ జరుగనుండగా.. అందు లో హైదరాబాద్ మినహా మిగిలిన అన్నీ మైదానాల్లో ఐదేసీ మ్యాచ్లు నిర్వహించనున్నారు.
ఉప్పల్ స్టేడియానికి మాత్రం కేవలం మూడు మ్యాచ్లను మాత్రమే కేటాయించారు. మెగాటోర్నీకి ముందు జరుగనున్న వార్మప్ మ్యాచ్ల్లో రెండింటిన హైదరాబాద్కు కేటాయించారు. ఈ అంశంపై పలు రాష్ట్ర సంఘాలు విమర్శలు వ్యక్తం చేయడంతో బోర్డు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు కనిపిస్తున్నది. మెగాటోర్నీ అనంతరం భారత్లో జరిగే వివిధ ద్వైపాక్షిక సిరీస్లలో మిగిలిన మైదానాలకు ప్రాధాన్యతనిస్తామని లేఖలో పేర్కొంది.