BCCI: అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత పురుషుల సెలక్షన్ కమిటీలో ఒక సెలక్టర్ పదవిని భర్తీ చేసేందుకు బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు బీసీసీఐ.. ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ చీఫ్ సెలక్టర్గా వ్యవహరిస్తున్న మెన్స్ సెలక్షన్ కమిషన్ లో శివ సుందర్ దాస్ (ఈస్ట్ జోన్), సుబ్రతో బెనర్జీ (సెంట్రల్ జోన్), సలిల్ అంకోలా (వెస్ట్ జోన్), శ్రీధరన్ శ్రీరామ్ (సౌత్ జోన్) లు సభ్యులుగా ఉన్నారు. జోన్ ల వారీగా సెలక్టర్లు ఉండే సెలక్షన్ కమిటీలో ప్రస్తుతం వెస్ట్ జోన్ నుంచి సలిల్ అంకోలా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఒక్క జోన్ నుంచి ఒక్క సెలక్టర్ మాత్రమే ఉండాలన్న నిబంధన నేపథ్యంలో అంకోలా తన పదవి నుంచి వైదొలగనున్నాడు.
ప్రస్తుతం చీఫ్ సెలక్టర్గా ఉన్న అజిత్ అగార్కర్ సైతం వెస్ట్ జోన్ నుంచే ఉన్నాడు. దీంతో అంకోలాను తప్పించి నార్త్ జోన్ నుంచి ఎవరినైనా తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారు. సెలక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వ్యక్తి.. భారత్ తరఫున కనీసం ఏడు టెస్టులు ఆడి ఉండాలి. లేదంటే దేశవాళీలో 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండాలి.
BCCI has posted an advertisement for the post of national selectors job on their website. [TOI by Gaurav Gupta] pic.twitter.com/vUYicoQKbb
— Johns. (@CricCrazyJohns) January 15, 2024