Rishabh Pant | స్టార్ క్రికెటర్ రిషబ్పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ప్రస్తుతం డెహ్రాడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పంత్కు అక్కడి వైద్యులు పలు సర్జరీలు చేశారు. కాగా, క్రికెటర్ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ క్రికెట్ సంఘం డైరెక్టర్ శ్యామ్ శర్మ తాజాగా వివరాలు వెల్లడించారు. పంత్ ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నట్లు చెప్పారు. అయితే, మెరుగైన చికిత్స కోసం పంత్ను బీసీసీఐ యూకేకి తరలించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
‘పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. మెరుగైన చికిత్స కోసం పంత్ను ఇవాళ ముంబయికి తరలిస్తున్నాం. అతని ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ కార్యదర్శి జైషా ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నారు. పంత్కు మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తరలించే యోచలో బీసీసీఐ ఉంది. అతన్ని యునైటెడ్ కింగ్డమ్ (యూకే) లేదా అమెరికాకు తరలించే అవకాశం ఉంది’ అని శర్మ తెలిపారు.
టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీన ఢిల్లీ నుంచి రోర్కీ వెళ్తుండగా అతను ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టింది. ప్రమాదం తర్వాత కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పంత్ వెంటనే కారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రస్తుతం అతను డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.