టోక్యో ఒలింపిక్స్లో భారత్ గర్వపడేలా చేసిన క్రీడాకారుల్లో నీరజ్ చోప్రా ఒకడు. జావెలిన్ త్రోలో ఏకంగా స్వర్ణం గెలిచిన నీరజ్.. అథ్లెటిక్స్లో భారత్కు తొలి స్వర్ణం అందించాడు. అనంతరం తన జావెటిన్ను ప్రధాని నరేంద్ర మోదీ కలెక్షన్కు ఇచ్చేశాడు. వీటికి నిర్వహించిన ఈ-వేలంలో నీరజ్ చోప్రా జావెలిన్ను భారతీయ క్రికెట్ కౌన్సిల్ (బీసీసీఐ) కొనేసింది.
దీనికోసం ఏకంగా రూ.1.5 కోట్లు పెట్టిన బీసీసీఐ.. ఈ జావెలిన్ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ‘భారత చూసిన అత్యుత్తమ అథ్లెట్స్లో ఒకడైన నీరజ్ చోప్రాకు చెందిన వస్తువు మా దగ్గర ఉండటం ఒక సంస్థగా ఎంతో గర్వించదగ్గ విషయం’ అని ఒక బీసీసీఐ అధికారి చెప్పారు.