న్యూఢిల్లీ: బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ముందు టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ భూజానికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడిని వన్డే జట్టు నుంచి టీం మేనేజ్మెంట్ తప్పించింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఆదివారం మొదటి వన్డే జరుగనుంది. ఇందులో భాగంగా నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో స్టార్ పేసర్ షమీ గాయపడ్డాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) వెల్లడించింది.
ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో బీసీసీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. పూర్తిగా వన్డే సిరీస్కు షమీ దూరమయ్యాడని తెలిపింది. అతని స్థానంలో యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. కాగా, ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్కు కూడా షమీ అందుబాటులో ఉండటం అనుమానమేనని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.