Team India : దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా మూడు వన్డేల సిరీస్(ODI Series)కు సన్నద్ధమవుతోంది. పొట్టి సిరీస్ను సమం చేసిన భారత్… రేపు తొలి వన్డేలో సఫారీలతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే.. వన్డే సిరీస్ ఆరంభానికి ముందు రోజే భారత జట్టుకు పెద్ద షాకింగ్ న్యూస్. అదేంటంటే..? వన్డే జట్టుకు రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) కోచ్గా వ్యవహరించడం లేదు.
అతడి స్థానంలో బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ సిబ్బంది సితాన్షు కొటాక్(Sitanshu Kotak)ను కోచ్గా నియమించింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టుకు కొటాక్ ఆధ్వర్యంలోని కోచింగ్ సిబ్బంది సలహాలు, సూచనలు ఇవ్వనురు. వన్డే సిరీస్ కోసం విడిగా కోచింగ్ స్టాఫ్ను నియమించాడనికి కారణం తెలుసా..?
మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన భారత బృందంలో దాదాపు 75 మంది క్రికెటర్లు దక్షిణాఫ్రికాలో ఉన్నారు. ఒక ఫార్మాట్కు కొందరిని, మిగతా ఫార్మాట్లకు మరికొందరిని ఎంపిక చేయడం వల్ల అందరికీ కోచింగ్ ఇవ్వడం ద్రవిడ్ బృందానికి కష్టమవుతోంది. అందుకని వాళ్లపై పని భారాన్ని తగ్గించేందుకు బీసీసీఐ వన్డే సిరీస్ బాధ్యతల్ని కొత్త కోచింగ్ సిబ్బందికి అప్పగించాలని భావించింది. అందుకని అనుభవజ్ఞుడైన కొటాక్ను కోచ్గా నియమించనుంది. అజయ్ రత్రా(Ajah Ratra) ఫీల్డింగ్ కోచ్గా, రజిబ్ దత్తా(Rajib Dutta) బౌలింగ్ కోచ్గా వ్యవహరించనున్నారు.
జొహన్నెస్బర్గ్ వేదికగా ఆదివారం తొలి వన్డే జరుగనుంది. డిసెంబర్ 19, 21న చివరి రెండు వన్డేలు నిర్వహించనున్నారు. వన్డే సిరీస్ ముగియగానే ఇరుజట్లు టెస్టు సిరీస్లో తలపడనున్నాయి. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ నేపథ్యంలో కోచ్ ద్రవిడ్ పూర్తిగా టెస్టు సిరీస్పై దృష్టి పెట్టనున్నాడు.