Osmania University | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఫుట్బాల్ చాంపియన్షిప్ టోర్నీకి ఉస్మానియా యూనివర్సిటీ ఎంపికైంది. మంగళూరు వేదికగా జరిగిన సౌత్ఈస్ట్ జోన్ ఫుట్బాల్ టోర్నీలో ఓయూ ఫుట్బాల్ టీమ్ నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో 23 ఏండ్ల తర్వాత ఆల్ఇండియా టోర్నీకి ఓయూ అర్హత సాధించింది. ఈస్ట్ జోన్ ఫుట్బాల్ టోర్నీలో ఓయూ టీమ్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. ఓయూ తరఫున సయ్యద్ ఇంతియాజ్ హుస్సేన్ తొమ్మిది గోల్స్తో టాప్లో నిలువగా, సయ్యద్ ఒవైసుద్దీన్ రెండు గోల్స్ ఖాతాలో వేసుకున్నాడు.