ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియా.. ఆ తర్వాత వన్డే సిరీస్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లెవరూ ఈ వన్డే సిరీస్ ఆడటం లేదు. ఈ క్రమంలోనే వన్డే సిరీస్ కోసం కొత్త జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ ఓపెనర్ శిఖర్ దావన్ సారధ్యం వహించనున్నాడు.
అతని డిప్యూటీగా శ్రేయాస్ అయ్యర్ను ఎంపిక చేయడం జరిగింది. అలాగే ఐపీఎల్తోపాటు దేశవాళీల్లో కూడా సత్తా చాటుతున్న రజత్ పటీదార్కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. అతనితోపాటు దేశవాళీల్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న ముకేష్ కుమార్కు కూడా ఈ టీంలో చోటు దక్కింది.
సఫారీలతో వన్డే సిరీస్ ఆడే భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయి, ముకేష్ కుమార్, ఆవేష్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్
Shikhar Dhawan (C), Shreyas Iyer (VC), Ruturaj Gaikwad, Shubhman Gill, Rajat Patidar, Rahul Tripathi, Ishan Kishan (WK), Sanju Samson (WK), Shahbaz Ahmed, Shardul Thakur, Kuldeep Yadav, Ravi Bishnoi, Mukesh Kumar, Avesh Khan, Mohd. Siraj, Deepak Chahar.#TeamIndia | #INDvSA
— BCCI (@BCCI) October 2, 2022