Chandrayaan-3 | అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. రోదసిలో ఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో (ISRO) విజయవంతంగా చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువం (South Pole)పై విక్రమ్ ల్యాండర్ (Vikram Lander)ను దించింది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం వెల్లడించింది. దీంతో ప్రపంచ దేశాలు భారత్ కృషిని కొనియాడుతున్నాయి. చంద్రయాన్-3 సక్సెస్ఫుల్ ల్యాండింగ్ కాగానే ప్రపంచ నాయకులు, శాస్త్రవేత్తలు ఇండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ లెజెండరీ బ్యాటర్ వసీం జాఫర్ (Wasim Jaffer) ఓ ఫన్నీ ట్వీట్ చేశాడు.
జాబిల్లిపై విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత తీసిన తొలి చిత్రాలను బెంగళూరులోని కమ్యూనికేట్ కేంద్రానికి పంపింది. ల్యాండర్ దిగుతున్న సమయంలో హారిజాంటల్ వెలాసిటీ కెమెరా తీసిన చిత్రాలను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. అయితే దీనిపై వసీం జాఫర్ ఫన్నీగా స్పందిస్తూ.. “ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకునే పిచ్ ఇది. నేను అయితే ముగ్గురు స్పిన్నర్లు, ఒక జెన్యూన్ సీమర్, ఒక అల్ రౌండర్ని టీంలో తీసుకుంటాను” అంటూ జాఫర్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ట్విట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది.
Definitely a bat first surface. I’d go with 3 spinners, one genuine seamer along with an all rounder 😛😉
📸: Chandrayaan3 #Chandrayaan3Landing pic.twitter.com/mkmk5h9AW5— Wasim Jaffer (@WasimJaffer14) August 23, 2023
చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ చరిత్రకెక్కింది. అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలిచింది.