IND vs ENG 4th Test : స్పిన్కు అనుకూలిస్తున్న రాంచీ పిచ్(Ranchi Pitch)పై భారత ఆటగాళ్లు చేతులెత్తేస్తున్నారు. ఇంగ్లండ్ యువ స్పిన్నర్లు టామ్ హర్ట్లే, షోయబ్ బషీర్(Shoaib Bashir) దెబ్బకు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరుతున్నారు. దాంతో, 118/3 తో లంచ్కు వెళ్లిన భారత్.. ఆ తర్వాత రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది.
తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో రోహిత్ సేనను కూల్చిన బషీర్ వరుస బంతుల్లో రవీంద్ర జడేజా(5), సర్ఫరాజ్ ఖాన్(0)లను ఔట్ చేశాడు. దాంతో, భారత్ 120 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పోరాడుతోంది. త్ విజయానికి ఇంకా 63 పరుగులు కావాలి. తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో ఆదుకున్న ధ్రువ్ జురెల్(7), శుభ్మన్ గిల్(21) లు ఆచితూచి ఆడుతున్నారు. కానీ, ఇంగ్లండ్ కెప్టెన్ ఇద్దరు స్పిన్నర్లతో అటాక్ చేయిస్తుండడంతో బౌండరీలు రావడమే గగనమైంది.
Bashirball. Bashball. Bazball.#INDvENG ▶️ https://t.co/N9hKxN5o8f pic.twitter.com/UGpUKtta2h
— ESPNcricinfo (@ESPNcricinfo) February 26, 2024
ఓవర్ నైట్ స్కోర్ 40తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఒక్కసారిగా పట్టు సడలించింది. బషీర్, హర్ట్లే విజృంభణతో 16 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 100 రన్స్కే మూడు వికెట్లు పడిన దశలో జడేజా, గిల్లు నాలుగో వికెట్కు 71బంతుల్లో 20 రన్స్ జోడించారు. దాంతో, హమ్మయ్యా మనమే గెలుస్తామని అభిమానులంతా గుండెపై చేయి వేసుకన్నారు. కానీ, లంచ్ తర్వాతి రెండో ఓవర్లోనే బషీర్.. జడ్డూను వెనక్కి పంపాడు. ఆ తర్వాతి బంతికే సర్ఫరాజ్ ఖాన్,(0)లను ఔట్ చేసిన టీమిండియాను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. అతడి స్పిన్ మాయతో రోహిత్ సేన 84/0 నుంచి 120/5 కు పడిపోయింది.