మిర్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న ఆఖరిదైన రెండో టెస్టులో బంగ్లాదేశ్ తొలి రోజు నుంచే పట్టు బిగిస్తున్నది. ఇప్పటికే సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న బంగ్లా…కివీస్ను తమ స్పిన్ ఉచ్చులో బిగిస్తున్నది. మెహదీహసన్ మిరాజ్(3/17), తైజుల్ ఇస్లాం(2/29) ధాటికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. వీరిద్దరి ధాటికి విలియమ్సన్(13), మిచెల్(12 నాటౌట్) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. బంగ్లా స్పిన్నర్లను ఎదుర్కొవడంలో కివీస్ బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బంగ్లా 172 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్(35) టాప్స్కోరర్గా నిలిచాడు. సాంట్నర్, ఫిలిప్స్ మూడేసి వికెట్లు తీశారు.
అయ్యో ముష్ఫికర్!
బంగ్లా సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ అరుదైన రీతిలో ఔటయ్యాడు. కైల్ జెమీసన్ బౌలింగ్లో బంతిని చేతితో అడ్డుకోవడం ద్వారా రహీమ్ పెవిలియన్కు చేరాడు. ఫీల్డింగ్కు అంతరాయం కల్గించాడన్న ఉద్దేశంతో థర్డ్ అంపైర్..రహీమ్ను ఔట్గా ప్రకటించాడు. ఇలా ఔటైన తొలి బంగ్లా క్రికెటర్గా ముష్ఫికర్ నిలిచాడు.