సిల్హెట్: పాకిస్థాన్తో రెండో టెస్టులో బంగ్లాదేశ్ పట్టుబిగించింది. వెటరన్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (137) బంగ్లా తరఫున అత్యధికంగా 14వ శతకంతో విజృంభించడంతోపాక్ ముందు 437 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్నైట్ స్కోరు 110/3తో మూడో రోజు సోమవారం ఆట కొనసాగించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్లో 390 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఓవర్నైట్ బ్యాటర్ కెప్టెన్ నజ్ముల్ శాంటో(15) నిరాశపర్చగా..ముష్ఫికర్ పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ కీలక ఇన్నింగ్స్తో కదంతొక్కాడు. లిటన్దాస్(69)తో కలిసి ఐదో వికెట్కు 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పాక్ బౌలర్లలో ఖుర్రామ్ షెహజాద్(4/86), సాజిద్ఖాన్(3/126) రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో మూడో రోజు చివరకు 2 ఓవర్లలో పాక్ పరుగుల ఖాతా తెరవలేదు.