ఆసీస్పై 4-1తో టీ20 సిరీస్ కైవసం
ఢాకా: స్టార్ ఆల్రౌండర్ షకీబల్ హసన్ (4/9) బంతితో చెలరేగిపోవడంతో.. ఆస్ట్రేలియా జట్టు తమ టీ20 చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సోమవారం జరిగిన చివరి టీ20లో ఆసీస్ 62 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటికే సిరీస్ పట్టేసిన బంగ్లా.. ఆఖరి పోరులో 60 పరుగుల తేడాతో నెగ్గి 4-1తో పొట్టి ఫార్మాట్ను ముగించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యఛేదనలో కంగారూలు తడబడ్డారు. షకీబ్తో పాటు సైఫుద్దీన్ (3/12), నసుమ్ అహ్మద్ (2/8) ధాటికి ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడను తలపించింది. కెప్టెన్ మాథ్యూ వేడ్ (22), మెక్డెర్మాట్ (17) మినహా తక్కిన తొమ్మిది మంది సింగిల్ డిజిట్కే పరిమితమవడంతో ఆసీస్ 13.4 ఓవర్లలో 62 పరుగులకు ఆలౌటైంది. సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన షకీబ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
2. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మార్క్ దాటిన రెండో బౌలర్గా షకీబ్ రికార్డుల్లోకెక్కాడు. లంక పేసర్ మలింగ (107) టాప్లో ఉన్నాడు.