చెన్నై: బంగ్లాదేశ్తో జరుగుతున్న కాన్పూర్ టెస్టు(Ind Vs Ban)లో మొదటి రోజు కేవలం 35 ఓవర్లు మాత్రమే బౌల్ చేశారు. వర్షం పడటం వల్ల ఆట నిలిచిపోయింది. తొలుత టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకున్నది. మొదటి రోజు 35 ఓవర్లలో బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 107 రన్స్ చేసింది. మోమినుల్ హక్ 40, ముష్ఫికిర్ రహీమ్ 6 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్ ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇవాళ పిచ్ చిత్తడిగా ఉండడంతో.. తొలి సెషన్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే లంచ్ తర్వాత కూడా మరోసారి వర్షం వల్ల ఆటకు బ్రేక్ అయ్యింది. ఇక మధ్యాహ్నం తర్వాత ఆటకు వాతావరణం అనుకూలించకపోవడంతో.. తొలి రోజు ఆటను నిలిపివేశారు. బంగ్లా బ్యాటర్లలో ఇస్లామ్ 24, శాంతో 31 రన్స్ చేశారు.
UPDATE 🚨
Due to incessant rains, play on Day 1 has been called off in Kanpur.
Scorecard – https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/HSctfZChvp
— BCCI (@BCCI) September 27, 2024