Bangladesh : వన్డే వరల్డ్ కప్లో ఘోరంగా విఫలమైన బంగ్లాదేశ్(Bangladesh)కు వరుసపెట్టి షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే శ్రీలంక ఆల్రౌండర్ ఎంజెల్ మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్'(Timed Out) వివాదం కారణంగా ఫాస్ట్ బౌలింగ్ అలెన్ డొనాల్డ్(Aallan Donald) రాజీనామా చేశాడు. తాజాగా ఆ జట్టు ప్రధాన పేసర్ తస్కిన్ అహ్మద్(Taskin Ahmed) స్వదేశంలో జరుగనున్న న్యూజిలాండ్ సిరీస్కు దూరం కానున్నాడు.
తాను కివీస్తో రెండు టెస్టుల సిరీస్కు అందుబాటులో ఉండడం లేదని ఆ దేశ క్రికెట్ బోర్డుకు తస్కిన్ తెలియజేశాడు. భుజం గాయంతో బాధపడుతున్న అతడు ఈమధ్యే రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి ఇంటికొచ్చాడు. దాంతో, రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో టెస్టు సిరీస్కు ఆడడం లేదు. మూడు టీ20 సిరీస్కు అందుబాటులో ఉంటా అని తస్కిన్ వెల్లడించాడు.
వరల్డ్ కప్లో బంగ్లా పేస్ యూనిట్కు నాయకత్వం వహించిన తస్కిన్.. చివరి లీగ్ మ్యాచ్లకు ముందు గాయపడిన విషయం తెలిసిందే. తస్కిన్తో పాటు కెప్టెన్ షకీబుల్ హసన్( shakib al hasan) కూడా టెస్టు సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉంది. వరల్డ్ కప్లో నవంబర్ 6న బెంగళూరులో శ్రీలంకతో మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తుండగా షకీబ్ ఎడమ బొటన వేలికి బంతి బలంగా తాకింది.
షకీబుల్ హసన్
నొప్పితో బాధపడుతూనే బ్యాటింగ్ కొనసాగించి జట్టును గెలిపించాడు. మ్యాచ్ అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్న షకీబ్ ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్కు దూరమయ్యాడు. టెస్టు సిరీస్కు కూడా అతడు అందుబాటులో ఉండకపోవచ్చు. టిమ్ సౌథీ సారథ్యంలో 15 మందితో కూడిన కివీస్ బృందం నవంబర్ 21న బంగ్లాకు బయలుదేరనుంది. రెండు టెస్టుల సిరీస్ తర్వాత బంగ్లాదేశ్ వన్డే, టీ20ల కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.