ఢాకా: స్వదేశంలో ఆస్ట్రేలియాకు ఇటీవలే చుక్కలు చూపించిన బంగ్లాదేశ్.. ఇప్పుడు న్యూజిలాండ్కు అలాంటి షాక్ ఇచ్చింది. పొట్టి ఫార్మాట్లో న్యూజిలాండ్ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన బంగ్లా సంచలనం నమోదు చేసింది. బుధవారం జరిగిన తొలి టీ20 పోరులో బంగ్లా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 61 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేధించింది. తొలుత కివీస్.. 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ టామ్ లాథమ్ (18), హెన్రీ నికోలస్ (18) కొంత సేపు ప్రతిఘటించారు. ఐదో వికెట్కు వీరిద్దరూ 34 పరుగులు జోడించారు. లాథమ్, హెన్రీ తప్ప మిగిలిన బ్యాట్స్మెన్ రెండంకెల స్కోరు కూడా చేయలేదు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజర్ 3 వికెట్లతో రాణించాడు. స్వల్ప లక్ష్య చేధన షకీబల్ హసన్ (25), ముష్ఫికర్ రహీమ్ (16*) రాణించి బంగ్లాను గెలిపించారు. ఈ గెలుపుతో బంగ్లా 1-0 ఆధిక్యంలో నిలిచింది.