ఢాకా: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన తొలి పోరులో బంగ్లా 23 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. షకీబ్ (36) టాప్ స్కోరర్. ఛేదనలో మిషెల్ మార్ష్ (45) మినహా తక్కినవాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఆస్ట్రేలియా 108 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ నసుమ్ అహ్మద్ 4వికెట్లు పడగొట్టాడు.