ODI World Cup 2023 : వరల్డ్ కప్లో చెత్త ప్రదర్శన కనబరుస్తున్న బంగ్లాదేశ్కు మరో షాక్ తగిలింది. చివరి లీగ్ మ్యాచ్కు కెప్టెన్ షకీబుల్ హసన్(Shakib Al Hasan) దూరం కానున్నాడు. ఎడమ చేతి చూపుడు వేలికి గాయం కావడంతో షకీబ్ విశ్రాంతి తీసుకోనున్నాడు. బెంగళూరులో శ్రీలంకతో మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తుండగా బంగ్లా సారథి చూపుడు వేలికి బంతి బలంగా తాకింది. అతడు కోలుకునేందుకు 4 రోజులు పట్టనుంది. దాంతో, చివరి మ్యాచ్లో శాంటో బంగ్లా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
శ్రీలంక నిర్దేశించిన 280 పరుగుల ఛేదనలో షకీబ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్ చేస్తుండగా బంతి చూపుడు వేలికి తగిలి నొప్పితో విలవిలలాడిన అతడు పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఆట కొనసాగించాడు. 65 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్థ శతకం బాది జట్టును గెలిపించాడు. సెమీస్ రేసులో వెనకబడిన బంగ్లా పుణేలో నవంబర్ 11న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
శ్రీలంక ఆల్రౌండర్ ఏంజెల్ మాథ్యూస్(Angelo Mathews) వివాదాస్పద ‘టైమ్డ్ ఔట్'(Timed Out)కు కారణమైన షకీబుల్ హసన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిదంటే..? షకీబ్ వేసిన 25 ఓవర్లో సమరవిక్రమ(41) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ హెల్మెట్ సరిగ్గా లేకపోవడంతో.. డగౌట్లోని సహచరులను వేరే హెల్మెట్
‘టైమ్డ్ ఔట్’గా వెనుదిరిగిన ఏంజెల్ మాథ్యూస్
తీసుకురమ్మని సైగ చేశాడు. అది చూసిన షకీబ్ టైమ్డ్ ఔట్ కోసం అప్పీలు చేశాడు. థర్డ్ అంపైర్ చివరకు మాథ్యూస్ను ఔట్గా ప్రకటించాడు. దాంతో, 146 ఏండ్ల క్రికెట్ చరిత్రలో టౌమ్డ్ ఔట్గా వెనుదిరిగిన తొలి క్రికెటర్గా మాథ్యూస్ రికార్డుల్లోకెక్కాడు. ఐసీసీ నియమాల ప్రకారం కొత్త బ్యాటర్ 2 నిమిషాలలోపు క్రీజులోకి రావాలి.