ఢాకా: వచ్చే నెలలో టీమ్ఇండియా బంగ్లాదేశ్లో పర్యటించనున్న నేపథ్యంలో బంగ్లాదేశ్-‘ఏ’తో జరుగుతున్న అనధికారిక టెస్టులో భారత్-‘ఏ’ తొలి రోజే పట్టుబిగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 112 పరుగులకు ఆలౌటైంది. మొసద్దిక్ హుసేన్ (63) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో సౌరభ్ కుమార్ 4, నవ్దీప్ సైనీ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్-‘ఏ’ మంగళవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 120 రన్స్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (61 బ్యాటింగ్), అభిమన్యు ఈశ్వరన్ (53 బ్యాటింగ్) అజేయ అర్ధశతకాలతో రాణించారు.