IND vs ENG : ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం(Rajiv Gandhi Stadium)లో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) పోరాడుతోంది. మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లీష్ జట్టు లంచ్ సమయానికి 108 పరుగులు చేసింది. జానీ బెయిర్స్టో(32), జో రూట్(18) క్రీజులో ఉన్నారు. అశ్విన్, జడ్డూ దెబ్బకు 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును వీళ్లిద్దరూ ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూ నాలుగో వికెట్కు 77 బంతుల్లో 48 రన్స్ జోడించారు.
టాస్ గెలిచిన బ్యాటింగ్ తీసుకున్న కెప్టెన్ స్టోక్స్ నమ్మకాన్ని నిలెబెడుతూ ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే(18), బెన్ డకెట్(35) దంచికొట్టారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీ అశ్విన్ విడదీశాడు. రెండో ఓవర్లో డకెట్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
England have played well on both sides of their mini-collapse from 55/0 to 60/3 #INDvENG
▶️ https://t.co/ScJisUw7M1 pic.twitter.com/goCAhG1Psx
— ESPNcricinfo (@ESPNcricinfo) January 25, 2024
ఆ కాసేపటికే జడేజా సూపర్ డెలివరీతో ఓలీ పోప్(1)ను బోల్తా కొట్టించాడు. దాంతో, 58 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ పడింది. ఆ కాసేటికే డేంజరస్ ఓపెనర్ క్రాలే(20)ను అశ్విన్ తెలివిగా బుట్టలో వేసుకున్నాడు. మిడాఫ్లో క్రాలే ఆడిన బంతిని సిరాజ్ డౌవ్ చూస్తూ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో, సోక్స్ 5 పరుగుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది.