BAI : ఆసియా క్రీడల్లో పతకాలతో చరిత్ర సృష్టించిన భారత షట్లర్ల(Indian Shuttlers)కు మరో సమరానికి సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ నెలాఖరున చైనాలో జరుగబోయే బీడబ్ల్యూఎఫ్(BWF) థామస్ కప్, ఉబెర్ కప్ ఫైనల్స్ ఆడనున్నారు. ఈ మెగా టోర్నీలకు మరో 20 రోజులే ఉండడంతో గురువారం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పురుషుల, మహిళల బృందాన్ని ప్రకటించింది.
పదిమందితో కూడిన పురుషుల బృందంలో ఐదురుగు సింగిల్ ప్లేయర్స్ ఉన్నారు. డబుల్స్లో ఇరగదీసేందుకు సాత్విక్(Satwik)- చిరాగ్ శెట్టి(Chirag Shetty)తో పాటు అర్జున్, ధ్రువ్ కపిలలు కాచుకొని ఉన్నారు. చీఫ్ నేషనల్ కోచ్ పుల్లెల గోపిచంద్, మల్లికా బరౌహ్ శర్మ, విమల్ కుమార్, జ్వాలా గుత్తా, మంజుష కన్వార్, పార్ధో గుంగూలీలతో కూడిన సెలెక్షన్ కమిటీ ఆటగాళ్లను ఎంపిక చేసింది.
Defending #ThomasCup champs & Asia’s new queens are ready to conquer again! 🏸👑
Presenting 🇮🇳 teams for the #ThomasUberCup2024 💪
📸: @badmintonphoto@himantabiswa | @sanjay091968 | @Arunlakhanioffi #ThomasCup2024#UberCup2024#TeamIndia#IndiaontheRise#Badminton pic.twitter.com/0JHo8soERO
— BAI Media (@BAI_Media) April 4, 2024
మహిళల బృందంలో ఆసియా గేమ్స్లో పతకంతో మెరిసిన అన్మోల్ కార్బ్, తన్వీ శర్మలు ఉన్నారు. చైనాలోని చెంగ్డూలో ఏప్రిల్ 27 నుంచి మే 5వ తేదీ వరకు ఈ టోర్నీ జరుగనుంది. నిరుడు చాంపియన్గా నిలిచిన టీమిండియా ఈసారి కూడా ట్రోఫీ కొట్టాలనే పట్టుదలతో ఉంది.
పురుషుల బృందం : హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రజావత్, కిరణ్ జార్జే, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, ధ్రువ్ కపిల, సాయి ప్రతీక్, ఎంఆర్. అర్జున్.
మహిళల బృందం : అన్మోల్ కార్బ్, తన్వీ శర్మ, అశ్మిత చలిహ, ఇషరాణి బరౌహ్, శృతి మిశ్రా, ప్రియా కొంజెబ్గమ్, సిమ్రాన్ సింగీ, రతికా థాకరే.