అమరావతి : ఏపీ(AP) కి చెందిన ముగ్గురు వైసీపీ ఎంపీ( YCP MPs) ల ప్రమాణంతో రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరంచింది. రాజ్యసభలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు మేడా రఘునాథ్ రెడ్డి , గొల్ల బాబురావు (Golla Baburao) , వైవీ సుబ్బారెడ్డిలతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankar ) ప్రమాణం చేయించారు. వీరి ప్రమాణంతో రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది.
ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 97 మంది, కాంగ్రెస్కు 29 , టీఎంసీకి 13 మంది ఉన్నారు. ఏపీకి చెందిన 11 మందితో నాలుగో స్థానానికి చేరుకుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వరుసగా సభ్యులుంటూ వస్తున్న టీడీపీకి ప్రస్తుతం రాజ్యసభలో సభ్యులు లేని పార్టీగా మరడం ఇదే ప్రథమం. కాగా గొల్ల బాబురావు హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేయగా, మిగతా ఇద్దరు ఇంగ్లిష్లో ప్రమాణం చేశారు.