సెంచూరియన్: దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండో సిరీస్ను పాకిస్థాన్ కైవసం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ ఉత్కంఠ మధ్య జరిగిన నాలుగో టీ20లో ఆతిథ్య సఫారీ జట్టుపై మూడు వికెట్ల తేడాతో గెలిచిన పాక్ 3-1తో టీ20 సిరీస్ను దక్కించుకుంది. డసెన్ (52), మలన్ (33) మినహా మిగిలిన వారందరూ విఫలమవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 19.3 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. మోస్తరు లక్ష్యఛేదనలో జమాన్ (60) రాణించినా ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోవడంతో పాక్ కష్టాల్లో పడింది. అయితే చివర్లో నవాజ్ (25 నాటౌట్) నిలవడంతో ఒక్క బంతి మిగిలి ఉండగా పాకిస్థాన్ గెలిచింది.
ఇవీ కూడా చదవండీ…