ప్రైవేట్ దవాఖానలో ఇప్పటికే రూ.లక్షన్నర ఖర్చు
ఇంటివైపు కూడా చూడని గ్రామస్తులు
స్టేషన్ఘన్పూర్, ఏప్రిల్ 16 : మండలంలోని ఓ గ్రామంలో కుటుంబానికి మొత్తానికి కరోనా సోకింది. చికిత్స కోసం ప్రైవేట్ దవాఖానలో చేరగా సుమారు రూ.లక్షన్నరకు పైగా ఖర్చు వచ్చింది. మండలంలోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన ఓ కటుంబంలోని ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురికి కరోనా సోకింది. ముందుగా జ్వరం రావడంతో గ్రామంలోని ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందారు. అయినా తగ్గకపోవడంతో డివిజన్ కేంద్రంలోని ఉన్నత శ్రేణి ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో కుటుంబంలోని ఆరుగురు పరీక్షలు చేయించుకోగా అందరికీ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. రమేశ్ అనే వ్యక్తి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించుకోవడానికి భయపడి హైదరాబాద్లోని ఓ దవాఖానలో నాలుగు రోజులుగా చికిత్స పొం దుతున్నాడు.
ఇప్పటి వరకు రూ.లక్షా యాబై వేలు ఖర్చు వచ్చిందని తెలి పాడు. తమ ఇంట్లో ఆరుగురు కరోనా పేషెంట్లు ఉండడంతో ఇంటి వైపు తొంగిచూసే వారు లేరని, గ్రామస్తులు కూడా ఎలాంటి సహాయ సహకా రాలు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని, దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నది.ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా సోకడంతో శుక్రవారం నుంచి గ్రామంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆశ వర్కర్లు, డప్పు చాటింపు ద్వారా ప్రజలకు తెలియజేసినట్లు సర్పంచ్ అనుమాల మల్లేశం తెలిపారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఆ కుటుంబ పరిస్థితి చూసైనా ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, మాస్క్ ధరించాలని సర్పంచ్ గ్రామస్తులకు సూచించారు.
ఇవి కూడా చదవండి
IPL 2021: ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్న్యూస్.. ఆ బౌలర్కు కరోనా నెగటివ్