పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆదివారం మీడియా సమావేశంలో జర్నలిస్టులపై మండిపడ్డారు. వెస్టిండీస్తో పాకిస్తాన్ ఆడబోయే సిరీస్కుముందు జరిగిన మీడియా సమావేశంలో రిపోర్టర్లు బాబర్ను పదే పదే ఒకే ప్రశ్న అడిగారు.
టీ20 ప్రపంచకప్లో భారత్తో జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత బాబార్ ఆజమ్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో ఏదో చెవిలో మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
దీని గురించి మీడియా రిపోర్టర్లు బాబర్ను పదే పదే అడిగారు. “మీరేం మాట్లాడారో చెప్పండి.. కోహ్లీతో ఏదో రహస్యంగా మాట్లాడారు. అదేంటో చెప్పండి బాబర్” అని అందరూ ప్రశ్నించారు.
దీంతో విసిగిపోయిన పాకిస్తాన్ సారథి వారితో గట్టిగా మాట్లాడతూ.. “మా మధ్య ఏం మాటల జరిగాయో వాటిని అందరి ముందు నేను చెప్పను. అది మా ఇద్దరి మధ్య విషయం.. దానిని మీ ముందు చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను” అని అన్నారు.
గత టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ 29 ఏళ్ల తరువాత భారత్పై అతి సునాయాసంగా విజయం సాధించిన విషయం తెలిసిందే.