హైదరాబాద్, జూన్ 23(నమస్తే తెలంగాణ)ః కోర్టు ధికార కేసులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ హైకోర్టు విచారణకు హాజరయ్యారు. హెచ్సీఏ నిర్వహించిన లీగ్ మ్యాచ్ల్లో నల్లగొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని 2021లో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయలేదన్న కోర్టు ధికార కేసు శుక్రవారం విచారణకు వచ్చింది.
జిల్లా అసోసియేషన్ దాఖలు చేసిన ఆ పిటిషన్ను జస్టిస్ వినోద్కుమార్ విచారణ చేపట్టారు. కావాలనే కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయలేదని అసోసియేషన్ వాదన. రెండు వారాల తర్వాత జరిగే విచారణకు కూడా అజారుద్దీన్ వ్యక్తిగతంగా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాల్లో పేరొన్నారు.