Azam Khan: పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ అజాం ఖాన్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఊహించని షాకిచ్చింది. కరాచీలో నిర్వహించిన నేషనల్ టీ20 టోర్నమెంట్లో భాగంగా బ్యాటింగ్ చేయడానికి వచ్చిన అతడు గత రెండు మ్యాచ్లలో తన బ్యాట్కు పాలస్తీనా మద్దతుగా ఆ దేశపు జెండాను అతికించడమే పీసీబీ ఆగ్రహానికి కారణమైంది. దీంతో అతడు తన మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది.
నేషనల్ టీ20 టోర్నమెంట్లో భాగంగా కరాచీ వైట్స్ తరఫున ఆడిన అజాం ఖాన్.. గత రెండు మ్యాచ్లలో తాను ఉపయోగించే బ్యాట్కు పాలస్తీనా జెండాను అంటించాడు. గత నెలన్నరగా ఇజ్రాయెల్ యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న పాలస్తీనాకు మద్దతుగా అతడు తన బ్యాట్కు స్టిక్కర్ అతికించాడు. కానీ పీసీబీ మాత్రం ఐసీసీ నిబంధనలను అనుసరించి అజాం ఖాన్కు షాకిచ్చింది. ఐసీసీ క్లాతింగ్ అండ్ ఎక్విప్మెంట్ నిబంధనలను అనుసరించి ఒక ఆటగాడు తాను ధరించే దుస్తులు, గ్లవ్స్, బ్యాట్, ప్యాడ్, ఇతరత్రా వాటిపై ఎటువంటి మద్దతు గానీ నిరసన గానీ తెలిపే సందేశాలు రాయకూడదు. ఈ నిబంధల ప్రకారమే పీసీబీ.. అతడిపై చర్యలకు దిగింది.
Azam Khan has been fined for putting a #Palestinian flag on his bat during a domestic match. I wonder why @TheRealPCBMedia did this. #PSL2024#ShameOnYouZaka #ShameOnPCB
We are Proud of you Azam Khan #Palestine#IsraeliNewNazism #PalestinaLivre pic.twitter.com/aQ80bzM2XC— Khurram🇵🇰 (@KhurramRANA21) November 26, 2023
వాళ్లకు అలా.. అజాంకు ఇలా..
పాలస్తీనాకు మద్దతు విషయంలో పీసీబీ అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు దారితీస్తోంది. ఇదే పీసీబీ.. కొద్దిరోజుల క్రితమే భారత్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ తన సెంచరీని పాలస్తీనాకు అంకితమిచ్చాడు. దీనికి పీసీబీ మద్దతిచ్చింది. అంతేగాక పాలస్తీనాకు మద్దతు అనేది తమ వ్యక్తిగత అంశమని సమర్థించుకుంది. కానీ అజాం ఖాన్ విషయంలో మాత్రం అతడిపై జరిమానా విధించడం గమనార్హం.