నింగ్బో(చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత యువ షట్లర్ ఆయూష్ శెట్టి రజత పతకంతో మెరిశాడు. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో సత్తాచాటిన ఆయూష్కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆయూష్ 8-21, 10-21తో షి యు కి(చైనా) చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. సెమీస్లో ప్రపంచ నంబర్వన్ షట్లర్ కునాల్వత్ విదిత్సరన్ను చిత్తుచేసి తుదిపోరుకు అర్హత సాధించిన ఈ 20 ఏండ్ల యువ షట్లర్ అదే పోరాట పటిమ కనబర్చలేకపోయాడు.
దీంతో గత ఆరు దశాబ్దాలుగా టోర్నీలో పసిడి పతకం కోసం భారత్ నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దినేశ్ కన్నా తర్వాత ఫైనల్ చేరిన రెండో భారత షట్లర్గా నిలిచిన ఆయూష్ కొత్త చరిత్ర లిఖించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 42 నిమిషాల్లోనే ముగిసిన పోరులో చైనీస్ షట్లర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. షి యు కి..ఆయూష్కు ఏమాత్రం అవకాశమివ్వకుండా వరుస గేముల్లో మ్యాచ్ను తన సొంతం చేసుకున్నాడు.